కరోనా దెబ్బకు అన్నీ బంద్ అయ్యాయి. ఇప్పుడు జనాలు మళ్ళీ సామాన్య స్థితికి వస్తున్నారు. అయితే అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చినా ఇంకా సినిమా థియేటర్స్ కి మాత్రం పర్మిషన్స్ ఇవ్వలేదు. సినిమా థియేటర్లు ఎప్పుడు మళ్ళీ తిరిగి తెరవబడతాయా అనే విషయం మీద ఇంకా స్పష్టత లేదు. దీంతో ఇప్పటికే సినిమాలు పూర్తి అయి రిలీజ్ కి రెడీ ఐన సినిమాలు, అలానే షూట్ పూర్తి కావోచ్చిన సినిమాలు తమ తమ సినిమాలని ఎప్పుడు ? ఎలా ? ఎందులో రిలీజ్ చేయాలో అని ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే నాని నటించిన 'వి' అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది మరియు అనుష్క యొక్క నిశ్శబ్దం సినిమా కూడా అక్టోబర్ 2 న విడుదల కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది.
అయితే ఇప్పుడు, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమా నిర్మాతలు ఈ చిత్రం కోసం ఒక వినూత్న రిలీజ్ పాలసీని ప్లాన్ చేస్తున్నారు. పే-పర్-వ్యూ ప్రాతిపదికన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. అంటే ఈ సినిమా కోసం ఒక వెబ్ పోర్టల్ ని క్రియేట్ చేస్తారు. అలా ప్రేక్షకులు సినిమాను చూడటానికి టోకెన్ టికెట్ ధర చెల్లించాలి. అయితే దీని గురించి మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. రామ్ గోపాల్ వర్మ తన తక్కువ బడ్జెట్ చిత్రాలకు ఈ మోడల్ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
ఒకవేళ అదే ఫార్మాట్ ని నమ్మి రంగ్ దే నిర్మాతలు ముందగుడు వేస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా త్వరలో షూట్ కి వెళ్లనుంది. ఈ నెల 23 నుండి హైదరాబాద్ లో ఈ సినిమా షూట్ జరగనుందని అంటున్నారు. ఈ షూట్ లో నితిన్ సహా కీర్తి సురేష్ అలానే ప్రధాన తారాగణం అంతా పాల్గొననున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా 30 శాతం బాకీ ఉంది. అయితే ఈ సినిమాకి జీ5 నుండి కూడా మంచి ఆఫర్ వచ్చిందట. మరి అందులో రిలీజ్ చేస్తారా ? లేక పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తారా ? అనేది చూడాల్సి ఉంది.