ఆమెకు సినిమా వ్యసనం కాదు, సినిమా ఒక ప్రొఫెషన్ మాత్రమే. అది కూడా దాసోహం అయ్యేంత సీన్ ఏమీ లేదు. నచ్చితే చేస్తుంది. ఆ పాత్ర తనకు నచ్చాలి. తాను మెచ్చాలి. అపుడే ఓకే అంటుంది. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే తనకు ఆ సినిమా ఇష్టం లేకపోతే నో చెప్పేస్తుంది. ఆమె డాక్టర్ అయిన తరువాత యాక్టర్ గా ఇండస్ట్రీకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, సాయిపల్లవి. తెలుగు సినిమాకు సాయిపల్లవి ప్రేమం సినిమా ద్వారా పరిచయం అయినా ఆమెను జనాలు చూసింది, ఫిదా అయింది. ఫిదా సినిమాతోనే. ఈ ఒక్క సినిమా ఆమెను ఎక్కడితో తీసుకుపోయింది.
ఇక ఏమండోయ్ నాని గారు అంటూ ఎంసీయే మూవీలో ఆమె నానితో ఆడి పాడిన తీరుకు కూడా యూత్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇవన్నీ ఇలా ఉంటే సాయిపల్లవి తన సినిమాలు అన్నీ సెలెక్టివ్ గానే చూసుకుంటుంది. ముందుగా తన పాత్ర నచ్చాలి. అపుడే ఆమె సరేనని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆ మధ్యన టాప్ స్టార్లు కూడా ఆమె డేట్స్ అడిగినా గ్లామర్ డాల్ గా తాను సినిమాల్లో షో చేయలేనంటూ నో చెప్పేసింది.
ఇవన్నీ ఇలా ఉంటే ఈ అమ్మడు గురించి ఇపుడు ఒక వార్త షికారు చేస్తోంది. అదేంటి అంటే ఈ అమ్మడు కి ఏకంగా రెండు కోట్ల పారితోషికం ఇచ్చారట. అది కూడా నాచురల్ స్టార్ నాని మూవీలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారుట. అందుకు గానూ ఆమె పారితోషికం ఏకంగా రెండు కోట్లు అని ఫిక్స్ చేసారుట.
ఇది నిజంగా ఒక స్టార్ హీరోకు ఇచ్చే అతి పెద్ద రెమ్యునరేషన్. నిజంగా కళ్ళు చెదిరే ఇంత మొత్తాన్ని సాయి పల్లవి తీసుకుంటోంది అంటే ఆమె డిమాండ్ మామూలుగా లేదుగా అంటున్నారు. ఇంతకీ ఆ మూవీ పేరు ఏంటి అంటే శ్యామ్ సింగరాయ్. మరి భారీ మొత్తం ఎంత ఇచ్చినా ఈ మూవీలో సాయి పల్లవి రోల్ బాగులేకపోతే నో అనేయడం ఖాయం. కనుక ఆమె పాత్ర కూడా చాలా బాగా ఉండాలి. సో ఈ మూవీ మీద అందరికీ ఒక్కసారిగా ఆసక్తి పెంచేసింది సాయిపల్లవి.