టాలీవుడ్ లో ఇప్పుడు సాయి పల్లవి క్రేజ్ అనేది కాస్త ఎక్కువగానే ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దాదాపు ఆమెతో సినిమాలు చేయడానికి స్టార్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం ఇప్పుడు చాలా వరకు భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెతో సినిమాలు చేయడానికి కొంత మంది దర్శకులు ముందుకొచ్చి కూడా వెనక్కి తగ్గిన పరిస్థితులు ఉన్నాయి టాలీవుడ్ లో. సాయి పల్లవి తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరిగింది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి పుష్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ ఆమెకు పాత్రకు సంబంధించి పూర్తిగా ఒక స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలుగా సాయిపల్లవి నటించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. సాయి పల్లవి ఆ పాత్ర కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అయితే భారీగా డిమాండ్ చేసిందని కూడా అంటున్నారు.
ఇక ఈ పాత్ర మొత్తం కూడా అడవిలోనే ఉంటుందని అయితే ఈ పాత్రకు గ్లామర్ కు సంబంధం లేదని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇక తమిళంలో కూడా సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ సాయి పల్లవి కి మంచి ఆఫర్లు వస్తున్నాయి. రానాతో ఆమె ఒక సినిమాలో నటిస్తోంది. శర్వానంద్ సాయి పల్లవి ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో చేసిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి..