రైతులకు మద్దతుగా నిలుస్తూ మాట్లాడారు ప్రముఖ హర్యానా డాన్సర్ సప్నాచౌదరి. ఆ వీడియోను ఆమె విడుదల చేసింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ దర్యాప్తు కేసుల మధ్య రైతుల దుస్థితిని విస్మరించవద్దని గాయని సప్నాచౌదరి మీడియాకు విజ్ఞప్తి చేశారు.‘‘జై జవాన్ జై కిసాన్… మా రైతుల కోసం కూడా మీ గొంతు పెంచాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను’’ అని సప్నాచౌదరి మీడియాను అభ్యర్థించారు.‘‘ రైతుల గొంతుకు మద్దతు ఇవ్వమని నేను మీడియా వ్యక్తులను అభ్యర్థిస్తున్నాను, అదే సమయంలో, రైతుల డిమాండును వినాలని ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తున్నాను’’ అని సప్నాచౌదరి వీడియోలో పేర్కొన్నారు. బిగ్ బాస్ 11లో పాల్గొన్న సప్నాచౌదరి ‘వీరే కి వెడ్డింగ్’, హట్ జా తూ’ సినిమాల్లోని ప్రత్యేక నృత్యగీతాలతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.‘నాను కి జాను’లో తేరే తుమ్కే సప్నాచౌదరి, లవ్ బైట్ పాటల్లో నర్తించారు