బాలీవుడ్ కమెడియన్ భారతి సింగ్ నివాసంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శనివారం ఉదయం దాడులు జరిపింది. సోదాలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ హత్యకు సంబంధించి బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై ఎన్సీబీ ఇటీవల ముంబైలో పలు చోట్ల ముమ్మరంగా దాడులు జరిపింది. పలువురు సెలబ్రెటీల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. నటుడు అర్జున్ రాంపాల్, ఆయన పార్టనర్ గాబ్రియేలా డెమిట్రియాడెస్ను డ్రగ్స్ కేసులో ఇటీవల ఎన్సీబీ ప్రశ్నించింది. నిర్మాత ఫెరోజ్ ఎ.నడియాడ్వాలా భార్యను అరెస్టు చేసింది. టీవీ జంట సనమ్ జోహర్, అబిజైల్ పాండేల ఇళ్లలోనూ సోదాలు జరిపింది.
కాగా, భారతి సింగ్ ఇటీవల కపిల్ శర్మ షోలో కనిపించారు. లల్లీ అనే కమిడెయిన్ పాత్రను అందులో పోషించారు. ప్రస్తుతం ఆమె తన భర్త హార్ష్ లిబచియాతో కలిసి ఇండియాస్ బెస్ట్ డాన్సర్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఝలక్ థిఖ్లా జా, నాచ్ బలియే వంటి పలు రియాల్టీ షోలకూ ఆమె పనిచేశారు. 2017 డిసెంబర్ 3న హార్ష్తో భారతి వివాహమైంది.