ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డబుల్‌ డోస్'‌ తో వస్తున్న మంచు విష్ణు

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 23, 2020, 12:22 PM



శ్రీను వైట్ల- మంచు విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన 'ఢీ' సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఆ సినిమాతో మంచు విష్ణు హీరోగా మంచి పేరు సంపాదించాడు. దీంతో అదే కాంబినేషన్‌ను మళ్లీ రిపీట్‌ చేయనున్నాడు విష్ణు. ఇవాళ విష్ణు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన నెక్ట్స్‌ మూవీని అనౌన్స్‌ చేశాడు విష్ణు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా "డబుల్‌ డోస్‌"{ఢీఢీ} మూవీని ప్రకటించారు. ఈ సందర్భంగా విష్ణు ట్వీట్‌ చేశాడు. పెద్ద అన్నయ్య శ్రీను వైట్లతో మరోసారి సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉందని విష్ణు చేశాడు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా.. మంచు విష్ణు హీరోగా మోసగాళ్లు అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రుహీ సింగ్ - నవదీప్ - నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com