సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ప్రముఖ టీవీ నటుడు అషీష్ రాయ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు 55 సంవత్సరాలు. లాక్ డౌన్ సమయం నుంచి ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. కొంత కాలం జుహూ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. డయాలసిస్ కూడా చేయించుకున్నాడు. కానీ మెరుగైన చికిత్స కోసం ఆయన వద్ద డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. ఆర్ధిక సమస్యల కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో నేడు ఆయన మృత్యువాత పడ్డాడు. అషీష్ రాయ్ ప్రముఖ టెలివిజన్ షోలు బనేగి అప్ని బాత్, సాసురల్ సిమార్ కా, రీమిక్స్, కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ మొదలగు సీరియల్స్లో నటించాడు.