ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'ఏ సూటబుల్ బోయ్' వెబ్ సిరీస్ వివాదాస్పదంగా మారింది. ఓ ఆలయ ప్రాంగణంలో ముద్దు సన్నివేశాలను చిత్రీకరించడం వివాదాస్పదమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆలయ ప్రాంగణంలో అసభ్యకరమైన సన్నివేశాలను చిత్రీకరించారంటూ నెట్ ఫ్లిక్స్ పై మధ్యప్రదేశ్ లో కేసు నమోదైంది. నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ లు.. కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంబికా ఖురానాల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ వివరాలను మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా వెల్లడించారు. ఈ వివాదంపై నెట్ ఫ్లిక్స్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరో వైపు ఈ వెబ్ సిరీస్ లో సినీనటి టబు కూడా నటించింది. కొన్ని సన్నివేశాలలో టబు కూడా హాట్ గా నటించడం చర్చినీయాంశంగా మారింది.