పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాల విషయంలో యమ దూకుడుని చూపిస్తున్నాడు. రాజకీయాల్లోంచి యూ టర్న్ తీసుకుని.. సినీ రంగంలో రీఎంట్రీ ఇచ్చిన పవన్... ఇప్పుడు వరుస చిత్రాలతో పెట్టి సినిమాలను ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వకీల్ సాబ్ ' సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ ఓ లాయర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఓ పాట, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. కరోనా తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఇక రీసెంట్గానే ఆయన 'వకీల్సాబ్' షూట్లో జాయిన్ అయ్యారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
వచ్చే సంక్రాంతి కి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మూవీ టీమ్. ఇక 'వకీల్సాబ్' సినిమా తర్వాత ఆయన ఏ సినిమా షూట్లో జాయిన్ అవుతారనే దానిపై క్లారిటీ లేనప్పటికీ.. రీసెంట్గా క్రిష్ బర్త్డే రోజు.. టీమ్ అంతా పవన్ని కలవడంతో.. 'వకీల్సాబ్' తర్వాత పవన్ ఖచ్చితంగా క్రిష్ సినిమానే చేస్తాడనేలా వార్తలు నడుస్తున్నాయి. పవన్ లుక్ కూడా ఈ సినిమా కోసం అనేలా మార్చాడు.ఇక ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుందనే విషయం తెలిసిందే.మరో హీరోయిన్గా ఈ సినిమాలో నిధి అగర్వాల్ అంటూ వార్తలు నడిచాయి. కానీ తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి చేస్తుందని అంటున్నారు.
అంతేకాదు..ఈ సినిమాలో ఆమె పాత్ర ఇదంటూ కొన్ని వార్తలు కూడా సంచరిస్తున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి జమీందారి కుటుంబ అమ్మాయిగా కనిపిస్తుందని అంటున్నారు. ఆమె పాత్ర సినిమాకి హైలెట్ అనేలా ఉంటుందని, అందుకే సాయిపల్లవి ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు.మరి ఇదే వార్త కనుక నిజం అయితే ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే. ఇక మరోవైపు పవన్ ఈ ప్రాజెక్ట్ కన్నా ముందు అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ లో నటిస్తాడనే వార్తలు కూడా ఫిల్మ్ నగర్ లో విపరీతంగా వినిపిస్తున్నాయి...!