కరోనా వల్ల ఎన్నో సినిమాలు నిలిచిపోయాయి. సినీ నటులు ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే టాలీవుడ్ స్వీటీ అనుష్క కూడా ఇంటికే పరిమితమయింది. ఆమెను అభిమానులు చూసి చాలా కాలమయింది. మొన్నామధ్య గోదావరి నదిలో పడవలో ప్రయాణించి షాకిచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రత్యక్షమయింది. కరోనా వల్ల ఇన్నాళ్లు బెంగళూరులోనే ఉండిపోయిన అనుష్క.. చాలా రోజుల తర్వాత హైదరాబాద్కు వచ్చింది. మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో సందడి చేసింది.