నటుడు..దర్శక..నిర్మాత ప్రభుదేవా డైరెక్షన్ లో యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది రాధే. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి సల్మాన్ఖాన్ సానుకూలంగా స్పందించాడు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఎగ్జిబిటర్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. ‘అందరికీ సారీ.. చాలా కాలం కిందట నేను ఈ నిర్ణయం తీసుకున్నా. కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతిన్న థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్ల సమస్యలు తెలుసుకున్నా. వారి విజ్ఞప్తి మేరకు రాధే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసి ఆర్థికంగా వారికి అండగా నిలుస్తానని సల్మాన్ తన సందేశంలో పేర్కొన్నాడు. రాధేను థియేటర్లలో విడుదల చేయడం వల్ల ఎగ్జిబిటర్లు కోరుకున్న మొత్తాన్ని తిరిగి అందుకుంటారని భావిస్తున్నా. ఆ దేవుడి కృపతో..ఈద్ 2021కు రాధేను థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేయండి’ ..అంటూ సల్మాన్ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ సినిమాలో మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. సల్మాన్ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.