యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభంజనం బాహుబలి సినిమా తర్వాత మరింత ఎక్కువైంది. తెలుగు రాష్రాలలోనే కాదు దేశ విదేశాలలోను ప్రభాస్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్.
జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్తో త్వరలోనే పలకరించనున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అయితే సినిమ అప్డేట్స్ తప్ప పెద్దగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్లు పెట్టని ప్రభాస్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో కొత్త మైలురాయిని సాధించాడు. ఆయన ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య ఆరు మిలియన్స్కు చేరింది. రానున్న రోజులలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. తెలుగులో మహేష్ బాబుకు 6.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, అల్లు అర్జున్ 10.2 మిలియన్ , విజయ్ దేవరకొండకు 10.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.