గత కొద్ది రోజులుగా పుష్ప షూటింగ్తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ హాలీడే టూర్లో భాగంగా దుబాయ్కు వెళ్లారు. అక్కడ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. దుబాయ్లోని ఫేమస్ థీమ్ పార్క్ను సందర్శించిన బన్నీ ఫ్యామిలీ అక్కడ పిల్లలతో పలు గేమ్స్ ఆడిస్తూ కనిపించాడు. చిల్డ్రన్స్ ప్లే మ్యూజియం ఎయిర్ గ్యాలరీలో అర్హను ఆడిస్తూ ఉన్న వీడియోను స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇది వైరల్గా మారింది. కాగా, ఇదివరకే మహేష్ బాబు, రామ్ చరణ్ , ఎన్టీఆర్ హాలీడే టూర్లో భాగంగా దుబాయ్కు వెళ్ళిన విషయం తెలిసిందే.
కొద్ది రోజులుగా పుష్ప షూటింగ్తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకున్నాడు. త్వరలో కేరళ షెడ్యూల్కు పయనం కానుండగా, ఆ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మంధాన కథానాయికగా నటిస్తుంది. ఆగస్ట్ 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.