బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. గతంలో హృతిక్ రోషన్ పై హీరోయిన్ కంగనా రనౌత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిద్దరి మధ్య జరిగిన ఈమెయిల్స్ సంభాషణపై వివరణ ఇచ్చేందుకు రావాలని హృతిక్ కు పోలీసులు సమన్లు జారీ చేశారు. దీంతో రేపు ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ ముందు హృతిక్ రోషన్ హాజరుకానున్నారు.