మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివతో 'ఆచార్య' చేస్తున్న చిరు.. త్వరలో మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న కొత్త సినిమా సెట్స్ మీదకి రానుంది. ఇక మెహర్ రమేష్, బాబీ కూడా మెగాస్టార్తో సినిమాలు చేయబోతున్నారు. ఈ క్రమంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ విన్నాడట మెగాస్టార్. కొంతకాలంగా ఈ కథపైనే కసరత్తులు చేస్తూ వచ్చిన వంశీ పైడిపల్లి, చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేశాడట. కాగా, మహేష్ బాబుతో 'మహర్షి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన వంశీ పైడిపల్లి.. ఇటీవలే ఈ చిత్రం జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకోంది. ఈ సినిమా తర్వాత వంశీ ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. తన తదుపరి సినిమా చిరుతో చేస్తాననే నమ్మకంతో ఉన్నాడట ఈ దర్శకుడు.