జబర్దస్త్ టాప్ మోస్ట్ కామెడీ షో అయినప్పటికీ దాని వెనుక నిత్యం ఏదో ఒక వివాదం వైరల్ అవుతూనే ఉంటుంది. అమ్మోరు, అరుంధతి వంటి సినిమాలను నిర్మించిన ప్రఖ్యాత మల్లెమాల సంస్థ నుంచి వచ్చిన ఆ షో 2013నుంచి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అయితే అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షేకింగ్ శేషు జబర్దస్త్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నా వయసుకు తగ్గ స్కిట్స్ చేయకపోవడం వలన ప్రజలు కూడా ప్రశ్నించడం స్టార్ట్ చేశారని అలాగే ఎప్పుడు ఒకే తరహాలో చేయడం కూడా తనకు అంతగా నచ్చలేదని, అందుకే జబర్దస్త్ లో లీడర్ రోల్ ను వదిలేయాల్సి వచ్చినట్లు చెప్పారు. ఎవరైనా పిలిస్తే మాత్రం కేవలం వాళ్ళ టీమ్ లో ఒక పాత్ర చేసి వస్తాను గాని టీమ్ లీడర్ గా చేయాలని అనుకోవడం లేదని అన్నారు. ఎందుకంటే మల్లెమాల ఇప్పుడు కఠిన నియమాలు తీసుకుందని జబర్దస్త్ తో అగ్రిమెంట్ కుదుర్చుకొని బయట షోలు చేసుకోవద్దని కండిషన్ పెట్టడం తనకు నచ్చలేదని అన్నారు.
ఇక హైపర్ ఆది స్కిట్స్ గురించి మాట్లాడుతూ.. ఆది ఎక్కువగా ఎదుటి మనిషి తప్పుల్ని లోపాల్ని గెలుగుతూ కాన్సెప్ట్స్ లేపుతూ ఉంటాడు. దొరబాబూ, పరదేశి చేసిన తప్పుల్ని ఇంకా వాడుతూనే ఉన్నాడు. అయితే ఎదుటి మనిషి ఎంత బాధ పడతాడు అనేది అతనికి అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఎదుటి వారిని బాధ పెట్టకుండా చేయగలిగితేనే కామెడీ అంటారు. వెనకాల సూదితో గుచ్చి ప్రేక్షకుల నవ్వించడం ఎంతవరకు కరెక్ట్? ఒక వ్యక్తిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. రైజింగ్ రాజను, శాంతి స్వరూప్ వంటి వారిని కూడా ఎంతగానో అవమాన పరుస్తాడు. కానీ తను మాత్రం అవమానపడడు. టీమ్ లో ఎదుటి వారిని అతి దారుణంగా హింసిస్తాడు. కొన్నాళ్లకు అవతలి వ్యక్తి తిట్లకు సూసైడ్ చేసుకోవాలి అనేలా స్కిట్స్ చేస్తాడు. అతని స్టైల్ అదే అంటూ.. అలా కాకుండా మంచి కామెడీ చేస్తే బావుంటుందని షేకింగ్ శేషు అభిప్రాయం వ్యక్తం చేశారు.