రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసి వచ్చిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. పూరి దర్శకుడిగా మొదటి ఛాన్స్ అందుకోవాడనికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో సమస్యలు అర్థం చేసుకుంటూ అనుకున్న లక్ష్యానికి మొండిగా చేరుకున్నాడు. ఇక అతని మొదటి సినిమా వచ్చి నేటికి 21 ఏళ్లయ్యింది. ఈ కెరీర్ మొత్తంలో అతను విజయాలతో పాటు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు. దాదాపు ఆయన గురువు రామ్ గోపాల్ వర్మ తరహాలోనే తెలియకుండా తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ను సెట్ చేసుకున్నాడు. అయితే మొదటి అవకాశం కూడా అనుకోకుండానే వచ్చింది. పవన్ కళ్యాణ్ తో మొదట చేయాలనుకున్న సినిమా బద్రి కాదట. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పాలని అనుకున్నాడట. కానీ ఎందుకో పవన్ కు ఆ కథ సెట్టవ్వదని బద్రి కథను వినిపించాడు. బద్రి క్లైమాక్స్ పవన్ కావాలని అభ్యంతరం చెప్పినా కూడా చేంజ్ చేయలేదు. అందుకే అతని కమిట్మెంట్ కు విలువ ఇచ్చి బద్రి ఛాన్స్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోలను కవర్ చేసేశాడు. ఇక సొంతంగా అప్పట్లో వైష్ణో ఆకాడమిని స్థాపించిన పూరి నిర్మాతగా కూడా మంచి లాభాలను అందుకున్నాడు. అయితే కొన్ని వ్యాపారులలో కొంతమందిని నమ్మి దాదాపు 100కోట్ల వరకు మోసపోవాల్సి వచ్చిందట. ఒక ఇంటర్వ్యూలో పూరి ఆ విషయంపై స్పందించాడు. ఆ మోసపోయిన సంఘటన తరువాత తన జీవితంలో ఎంతగానో మార్పు వచ్చిందని వివరణ ఇచ్చాడు. వరుస అపజయాల అనంతరం ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన పూరి కొత్తగా పూరి జగన్నాథ్ టాకీస్ అనే ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసాడు.