బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు ట్విటర్ సంస్థ షాకిచ్చింది. కంగనా రనౌత్ అకౌంట్ ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ఆదివారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా కంగన అభ్యంతరకర ట్వీట్లు చేయడంతో ఆమె అకౌంట్ను సస్పెండ్ చేశారు. ఇది ట్విటర్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు అవుతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కంగనా ఓ రాక్షసిగా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని.. అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ గెలిచినా అక్కడ హింస చెలరేగలేదని, పశ్చిమ బెంగాల్ లో మాత్రం టీఎంసీ హింసకు దిగుతోందని కంగనా ట్వీట్ చేసింది. బెంగాల్ మంటల్లో కాలిపోతోందంటూ కంగనా ట్వీట్ చేయడంపై ట్విట్టర్ అభ్యంతరం తెలిపింది. తన ట్వీట్లలో ఇందిరా గాంధీపై కూడా కంగనా రనౌత్ పలు కామెంట్లు చేసింది.