సంక్రాంతి కానుకగా విడుదలైన కంబాలపల్లి కథలు ఛాప్టర్ 1 ‘మెయిల్’ కు అరుదైన గౌరవం దక్కింది. అందర్ని ఆకట్టుకున్న ఈ మూవీ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021కు ఎంపికైంది. జూన్ 4న న్యూయార్క్ వేదికగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించగా ప్రియాంకదత్ నిర్మించారు. ప్రియదర్శి, హర్ష, ప్రియ తమ నటనతో ఆకట్టుకున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలన్న ఓ యువకుడి కథ నేపథ్యంలో సాగిన ఈ మూవీ చాలా మంది బాల్యాన్ని గుర్తుచేసింది.