దేశంలో కరోనా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఫలితంగా కొందరు వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులపై నటి రాఖీ సావంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వీడియో ద్వారా మంత్రులపై దుమ్మెత్తపోశారు. ఈ వీడియోలో.... ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపడంతో పాటు... చాలామంది అయినవారిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివరాలు చెబుతున్నప్పుడు ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు.
ఈ వీడియోను విరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో రాఖీ సావంత్ మంత్రులను ఉద్దేశిస్తూ... తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు మిమ్మల్ని క్షమించగలరా? జనాలంతా ఇలా మరణిస్తుంటే వారికి అంత్యక్రియలు కూడా చేయలేం. అయినవారిని కోల్పోయనవారు మిమ్మల్ని క్షమించగలరా? ఇంతకీ ఆ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? దేశంలోని పేద ప్రజలకు ఆక్సిజన్, వ్యాక్సిన్ అందడం లేదు. అంటూ రాఖీ తన ఆవేదన వ్యక్తం చేశారు.