ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా పరిస్థితులపై మంత్రులను నిలదీసిన రాఖీ సావంత్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, May 11, 2021, 09:06 AM



దేశంలో కరోనా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఫలితంగా కొందరు వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులపై నటి రాఖీ సావంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వీడియో ద్వారా మంత్రులపై దుమ్మెత్తపోశారు. ఈ వీడియోలో.... ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపడంతో పాటు... చాలామంది అయినవారిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివరాలు చెబుతున్నప్పుడు ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు.


ఈ వీడియోను విరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో రాఖీ సావంత్ మంత్రులను ఉద్దేశిస్తూ... తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు మిమ్మల్ని క్షమించగలరా? జనాలంతా ఇలా మరణిస్తుంటే వారికి అంత్యక్రియలు కూడా చేయలేం. అయినవారిని కోల్పోయనవారు మిమ్మల్ని క్షమించగలరా? ఇంతకీ ఆ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? దేశంలోని పేద ప్రజలకు ఆక్సిజన్, వ్యాక్సిన్ అందడం లేదు. అంటూ రాఖీ తన ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com