ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన అంజిగరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చేరారు. ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన మూత్ర పిండాల్లో రాళ్ళు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాల్లో పలు చిత్రాల్లో విలన్ గా నటించిన మన్సూర్ అలీఖాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.