మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా దసరాకు ప్రారంభం కాబోతోందా?. అవుననే వార్త ఒకటి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఛలో, భీష్మ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో కొత్త సినిమాకు వరుణ్ తేజ్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కూడా రష్మిక మందనను ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి ఎఫ్3, బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గని సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత వెంకీ కుడుముల డైరెక్షన్ లో కొత్త మూవీ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.