కరోనా సెకండ్ వేవ్ కల్లోలంలో ప్రజల పరిస్థితులని గమనిస్తున్న కొందరు సినీ సెలబ్రిటీస్ తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా అవసరమైన వారికి తన వంతు సాయం చేస్తానని పేర్కొంది. సోషల్ మీడియాను సినిమా ప్రమోషన్స్కు వాడుకునే వారు కూడా ఇప్పుడు కోవిడ్ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం సంతోషంగా ఉంది. నా ఇన్స్టగ్రామ్ మేసేజ్ ఇన్ బాక్స్ ఓపెన్లో ఉంటుంది. ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్లో బెడ్స్ లేదా మందులు.. ఇలా ఏదైన అవసరం అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. నా వంతు సాయం చేస్తాను. గత పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆర్ధిక సాయం మాత్రం చేయలేను అని రేణూ పేర్కొన్నారు.