ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ దర్శకుడికి కరోనా.. ఆందోళనకరంగా మారిన పరిస్థితి.!

cinema |  Suryaa Desk  | Published : Wed, May 12, 2021, 11:54 AM



కరోనా మహమ్మారి వల్ల ఈ రోజు మంచిగా కనిపించిన వ్యక్తి రేపటికి స్వర్గస్తులవుతున్నారు. కరోనా వలన రోజుకు వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా బారిన పడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. తాజాగా 'దిల్‌ పే మత్‌ లే యార్‌', 'సిటీలైట్స్‌', 'సిమ్రాన్‌' చిత్రాలతో పాటు ఇటీవల 'స్కామ్‌ 1992'  వెబ్‌ సిరీస్‌  తీసిన దర్శకుడు ' హన్సల్ మెహతా ' ఇంట్లో కరోనా కలకలం రేగింది. దర్శకుడు హన్సల్ మెహతాతో పాటు ఆయన కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది.అయితే హన్సల్ పరిస్థితి కొంత ఆందోళన కరంగా మారగా, ఆ సమయంలో ఎవరు కూడా అతనికి అండగా నిలవలేకపోయారు. ఇప్పుడు అందరు కోలుకుంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. మేం సేఫ్‌గా ఫీలయ్యేలా చేసింది. దయచేసి కరోనా జాగ్రత్తలు పాటించండి. మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యాక్సిన్‌ వేయించుకోండి. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులని సంప్రదించండి అని అయన వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com