టాలీవుడ్ లో ఆ మధ్య వరుసగా రీమేక్ మరియు బయోపిక్ లు వచ్చాయి. టాలీవుడ్ లో ఒక్కో సమయం లో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్ ల జోరు కొనసాగుతోంది. రాబోయే ఏడాది కాలంలో ఏకంగా పది సినిమాలకు పైగా సీక్వెల్ లు రాబోతున్నాయి. కొన్ని పాత సినిమాలు మరియు కొన్ని సినిమాలకు సీక్వెల్ ల్లు పట్టాలెక్కబోతున్నాయి. కన్నడ కేజీఎఫ్ నుండి మొదలుకుని హిట్ వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రూపొందుతున్నాయి. ఇటీవల విడుదల అయిన జాతిరత్నాలు సినిమాకు సీక్వెల్ కోసం కథ సిద్ధం అయినట్లుగా దర్శకుడు అనుదీప్ ఇటీవలే చెప్పుకొచ్చాడు. మంచు విష్ణు శ్రీను వైట్ల కాంబోలో ఢీ కి ప్రస్తుతం సీక్వెల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన క్రాక్ సినిమాకు సీక్వెల్ కూడా చర్చలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హిట్ సినిమా కు ఇప్పటికే సీక్వెల్ పట్టాలెక్కింది.
కార్తికేయ సినిమాకు కూడా సీక్వెల్ రూపొందుతోంది. నాగార్జున హీరోగా బంగార్రాజు సినిమా రూపొందబోతుంది. ఇది సోగ్గాడే చిన్ని నాయనా కు సీక్వెల్ అనే విషయం తెలిసిందే. గూఢచారి సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. తేజ సజ్జా హీరోగా రూపొందిన జాంబీ రెడ్డి సినిమాకు కూడా సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ లు సక్సెస్ అయితే ఖచ్చితంగా మరిన్ని సినిమాలు కూడా సీక్వెల్స్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.