దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్లో వస్తోన్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు అదిరిపోయే ఓటీటీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ సంస్థ ముప్పై కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం మరి డైరెక్ట్ రిలీజ్కా.. లేదా థియేట్రికల్ రన్ తర్వాత అనేది తెలియాల్సి ఉంది. ఇక నక్సల్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాలో యూత్కు సంబందించి కొత్త అంశాన్ని చర్చించి మంచి హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఊడుగుల’ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతోంది. సినిమా ప్రధానంగా పొలిటికల్ థ్రిల్లర్ అయినా మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్గా ఉంటాయని టాక్. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నాడు దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.