ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేశ్‌ బాబు సినిమాలో శిల్పాశెట్టి ?

cinema |  Suryaa Desk  | Published : Fri, May 14, 2021, 08:55 AM



సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’. ఈ మూవీ ఆఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ రాబోతున్న సినిమా ఇది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో  ‘అతడు’  ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని ఓ కీలకపాత్ర పాత్రం కోసం బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పేరును పరిశీలిస్తన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.


త్రివిక్రమ్‌ సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్‌ స్టార్‌ హీరోయిన్లను తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అలా నదియా,ఖుష్బూ, స్నేహ వంటి హీరోయిన్లు త్రివిక్రమ్‌ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28లో శిల్పా శెట్టి అయితే బావుంటుందని మూవీ మేకర్స్‌ అభిప్రాయపడుతున్నారట. ఇక ఈ సినిమాలో హేశ్‌ సరసన ఇప్పటికే పూజా హెగ్డె ఎంపికైన తెలిసిందే. మరో హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంతో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేశ్‌ నటిస్తున్నారు. ఇటీవల దుబాయ్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com