ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తీయబోయే 30వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం తర్జనభర్జన పడ్డ యూనిట్ ఎట్టకేలకు పేరును ఖరారు చేసింది. మొదట పరిగణించిన కియారా అద్వానీనే ఖాయం చేశారు.ఎన్టీఆర్- శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుందని సమాచారం ఇన్నిరోజులు వినిపించింది. తాజాగా ఈ సినిమాలో నటించడం కోసం కియారా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే మొదటి షెడ్యూల్ షూటింగ్ లో ఈమె పాల్గొంటున్నట్లు సమాచారం. కియారా అద్వానీ ఇదివరకే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనుందని చిత్రబృందం తెలియజేస్తున్నారు.