బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై అనసూయ మంచి పేరు తెచ్చుకుంది. అనసూయ అందుకు తగ్గట్టుగానే విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. క్షణం, రంగస్థలం, థ్యాంక్యూ బ్రదర్ వంటి సినిమాల్లో ఆమె ఎంచుకున్న పాత్రలు మంచి పేరును తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ మరో డిఫరెంట్ జానర్ సినిమాకు ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో ఆకట్టుకున్న జయశంకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ కొత్త సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదో ఆంథాలజీ మూవీ అని, ఇందుల 6 కథల సమ్మేళనం ఉంటుందని, ప్రతి కథలో ఒక లీడ్ ఉంటారని, ఇలా అనసూయ కూడా ఓ కథకు లీడ్ రోల్ పోషిస్తుందని సమాచారం. అయితే వచ్చే నెల నుంచి అనసూయ ఈ సినిమా సెట్స్లో జాయిన్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.