ప్రముఖ టీవీ యాంకర్, నటి గాయత్రికి సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్ హ్యాక్ చేశారు. దీంతో ఆమె వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని దుండగులు తన ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేసి వివిధ మతాలకు సంబంధించి అభ్యంతకరమైన పోస్టులు చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్గవి ఫేస్ బుక్ అఫీషియల్ అకౌంట్ తో పాటు మరో అకౌంట్ ను దుండగులు క్రియేట్ చేసినట్లు గుర్తించామని ఏసీపీ కె.వి. ఎం ప్రసాద్ అన్నారు. సైబర్ ఎటాక్ నుండి తప్పించుకోవడానికి పాస్ వర్డ్ లు ఎప్పటికప్పుడు మార్చుకోవాలని సూచించారు.