శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "లవ్ స్టోరీ". ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా నిన్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో శేఖర్ కమ్ముల మార్క్ కనిపించడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాను ప్రశంసిస్తూ ఈ మేరకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా మొత్తం రన్ టైమ్ వచ్చేసరికి 2 గంటల 25 నిమిషాలుగా ఉన్నట్టు తెలిపారు.