ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ విడుదల వాయిదా పడనుందా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 16, 2021, 12:38 PM



దేవ కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్‌లు హీరో హీరోయిన్‌లుగా  తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’.  ఈ చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అయితే ఇటీవల సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంత తక్కువ వ్యవధిలో సాయితేజ్ కోలుకుని ప్రమోషన్స్‌లో పాల్గొనడం కష్టమేనని, దీంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరీ ఈ సినిమాను అనుకున్న తేదికే విడుదల చేస్తారా లేక నిజంగానే వాయిదా వేస్తారా అనే దానిపై త్వరలోనే అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com