సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా మూవీ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ పిక్ రివీలై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగురోంది. ఇందులో భాగంగా సినిమాలోని హైలైట్ సన్నివేశాలని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. బుల్లెట్ బండిపై అల్ట్రా స్టైలిష్ లుక్స్తో మహేష్ కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూస్తుంటే ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇదేంటో తెలియాలి అంటే 'సర్కారు వారి పాట' విడుదల వరకు ఆగక తప్పదు. ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. థమన్ సంగీత దర్శకుడు.