ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దేవీ శ్రీ ప్రసాద్ బాబాయి బుల్గానిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేవీ శ్రీ బాబాయి బుల్గానిన్ మరణ వార్త విని దేవీ శ్రీ ప్రసాద్ మేనత్త సీతా మహాలక్షి గుండెపోటుతో మరణించారు. వరుస మరణాలతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.