శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "లవ్ స్టోరీ". ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా నిన్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో శేఖర్ కమ్ముల మార్క్ కనిపించడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొండంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్తో హైదరాబాద్లోని థియేటర్లు హౌస్ఫుల్ అయిపోతున్నాయి. హైదరాబాద్లో ఉన్న థియేటర్లలో మొదటి రోజు 245 షోలలో 85 షోలు ఫాస్ట్గా బుకింగ్స్ అయిపోయాయి. మహేష్ బాబు ఆంభ్ సినిమాస్లో కూడా ఇప్పటికే 6,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీతో ముందుగానే థియేటర్లు ఫుల్ అయ్యాయి. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఓపెనింగ్స్పై కన్నేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 19న జరగనుంది.