టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్ఎస్ఎల్) దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో తరుణ్లకు క్లీన్ చిట్ ఇచ్చింది. పూరి జగన్నాథ్, తరుణ్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ వెల్లడించింది. వీరివురి బ్లడ్, హెయిర్ , గోళ్ళ నమూనాలను సేకరించిన ఎఫ్ఎస్ఎల్.. రిపోర్ట్లో డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించింది. 2017 జులైలో ఎక్సైజ్ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు సెలబ్రిటీల నుంచి బ్లడ్ , హెయిర్ , గోళ్ళ నమూనాలను ఎఎఫ్ఎల్ సేకరించింది. వారు స్వచందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపింది. గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు సమర్పించింది. కెల్విన్పై ఛార్జ్ షీట్ తో పాటు ఈ వివరాలను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోర్టుకు సమర్పించింది. ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు కెల్విన్ను రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని కెల్విన్ను కోర్టు ఆదేశించింది.