ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 05:53 PM



మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశాయి. ఆయన స్పృహలోకి వచ్చారని అపోలో ఆస్పత్రి సిబ్బంది ప్రకటించారు. అంతేకాదు తేజు కి వెంటిలేటర్ ను తొలగించినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మరికొన్ని రోజుల పాటు సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ లోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉందని తెలిపారు. శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నట్లు.. తనంతట తానే సాయిధరమ్ తేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com