ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారంలా మెరిసిపోతున్న ప్రగ్యా జైశ్వాల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 20, 2021, 09:41 AM



ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా  కలిసి రాలేదు. అఖండ విషయానికి వస్తే. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా కేసులు తగ్గడంతో గతకొద్ది రోజులుగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌ జరుగుతోంది. కాగా తాఅందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది. 'అడిగా అడిగా' అనే పాట విడుదల చేయగా ఈ పాటకు కళ్యాణ చక్రవర్తి లిరిక్స్ అందించాడు. ఇక ఎస్పీ చరణ్, ఎం ఎల్ శృతి ఈ పాటను పాడి వినిపించారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పాట నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంది. జాగా వస్తోన్న సమాచారం మేరకు ఆ షెడ్యూల్‌ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. దీంతో ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.


అంతేకాకుండా ఈ పాటకు తెగ లైకులు కూడా వస్తున్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనీ చూస్తోందట చిత్రబృందం. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. సంక్రాంతికి విడుదలపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ఈ సినిమా నుంచి ఉగాది సందర్భంగా ఓ టీజర్‌‌ను విడుదల చేయగా.. ఆ టీజర్ మంచి ఆదరణ పొందింది


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com