బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభమై రెండు వారాలు పూర్తయ్యాయి. అయితే 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్-5 కార్యక్రమంలో తొలివారం సరయు ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండో వారం నామినేషన్ లో కాజల్, లోబో, ప్రియాంక సింగ్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్ ఉండగా శనివారం రోజు లోబో, అనీ మాస్టర్, ప్రియాంక సింగ్ లు సేవ్ అయ్యారు. మిగతా ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే అంత అనుకున్నట్లే ఈ వారం హౌస్ నుండి ఉమాదేవి ఎలిమినేషన్ అయ్యింది. తొలి నుంచి చాలా అగ్రిసివ్గా ఉన్న ఉమ.. నామినేషన్స్ సందర్భంగా తిట్టిన బూతు చాలామందికి ఇబ్బందిగా అనిపించింది. అదే ఆమెను ఎలిమినేషన్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత ఆమెను బిగ్ బాస్ ఫుల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఆమెను చాలావరకూ పాజిటివ్గా చూపించే ప్రయత్నం చేశారు. లోబోతో కొత్త లవ్ ట్రాక్ స్టార్ట్ చేశారు. అయితే నామినేషన్స్లోకి వచ్చిన తొలి రెండురోజుల్లోనే ఆమెకు నెగిటివ్గా చాలా ఓట్లు పడ్డాయి. ఈ రెండు మూడు రోజులు ఉమాదేవి అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హౌస్లో ఉన్న చాలామందితో పోలిస్తే ఉమాదేవి బెటర్ అని, ఆమె కంటెంట్ ఇవ్వడంతో పాటు ఎంటర్టైన్ చేసిందని కామెంట్లు చేస్తున్నారు. మొదటి వారంలో అందరినీ బెదరగొట్టిన ఉమా, రెండో వారంలో మాత్రం తన రూటు మార్చుకుని లోబోతో కామెడీ చేస్తూ అదరగొట్టిందంటున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఆమె బిగ్ బాస్ హౌస్ ను వీడక తప్పలేదు.