బిగ్బాస్ హౌస్లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా, నవ్వించినా, నవ్వులపాలైనా, ఏడ్చినా, ఒకరిని ఏడిపించినా, సేఫ్ గేమ్ ఆడినా, ఆడకపోయినా, ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా.. బిగ్బాస్ ఇంట్లో అడుగు పెట్టాక ఎప్పుడో ఒకసారైనా ఈ గండం బారిన పడక తప్పదు. ఈ నామినేషన్స్ కంటెస్టెంట్ల బలాబలాలను నిరూపించడమే కాకుండా ప్రేక్షకులు ఎవరి వైపు నిలబడుతున్నారన్న విషయాన్ని కూడా సుస్పష్టం చేస్తాయి.
19 మంది సెలబ్రిటీలతో ప్రారంభమైన బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ రెండు వారాలు పూర్తి చేసుకుంది. సరయు, ఉమాదేవి హౌస్ను వీడివెళ్లడంతో ఇంటిసభ్యుల సంఖ్య 17కు చేరింది. వీరిలో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు హౌస్లో నామినేషన్స్ జరిగాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక సింగ్, లహరి నామినేషన్స్లో ఉన్నారట! వీరిలో మానస్ మొదటి వారం, ప్రియ, ప్రియాంక సింగ్ రెండో వారం నామినేషన్లను ఎదుర్కొన్నారు. శ్రీరామచంద్ర, లహరి మాత్రం తొలిసారి నామినేషన్ జోన్లో అడుగు పెట్టారు. మరి వీరిలో ఎవరు బాగా ఆడి ఈ గండం నుంచి గట్టెక్కుతారు? ఎవరు హౌస్కు వీడ్కోలు పలుకుతారు? అన్నది ఇంట్రస్టింగ్గా మారింది.