పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50వేల రూపాయల పూచీకత్తుపై కోర్టు సోమవారం రాజ్కుంద్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అశ్లీల చిత్రాల కేసులో జులై19 నుంచి రాజ్కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.