సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లవ్ స్టోరి'. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల గ్రాండ్గా థియేటర్లలో విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాకు లవ్ స్టోరి చిత్ర విశేషాలతో పాటు తన తదుపరి చిత్ర వివరాలను కూడా తెలిపారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..'... 'నేనే కాదు ఎవరైనా సరే తమ సినిమాలు చరిత్రలో నిలిచేలా ఉండాలనే తీస్తారు. లవ్ స్టోరి చిత్రంలో కూడా ఆ షేడ్స్ ఉన్నాయి. కొన్ని అంచనాలు ప్రతీ ఒక్కరు పెట్టుకుంటారు. మొన్న నాగార్జున గారు ప్రేమ్ నగర్ సినిమా రిలీజ్ రోజున ఇది కూడా అవుతుంది అని పెట్టారు. ఆ సినిమా సక్సెస్లో నా సినిమా ఒక 30 పర్సెంట్ అందుకున్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నేను తీసిన లీడర్ సినిమా అప్పుడు అందరు మామూలుగానే చూశారు కానీ ఇప్పుడు దాని కోసం ఇంకా మాట్లాడుకుంటారు. అలానే నేను ప్రతీ సినిమాని, సన్నివేశాన్ని ఇంతకు మించి ఎవరూ తియ్యలేరు అన్నట్టుగా చేయాలని ప్రయత్నిస్తా. ఒక పదేళ్లు తర్వాత నా పిల్లలకి కూడా గర్వంగా సినిమా చూపించగలగాలి అనుకుంటా.
లీడర్ సినిమా సీక్వెల్ ఖచ్చితంగా చేస్తా, కానీ ఇప్పుడు కాదు అదే పాత్రలతో రానా ఖచ్చితంగా ఉంటాడు. ఆ పాత్రలతోనే నడిచే విధంగా సీక్వెల్ని చేస్తాను. నెక్స్ట్ ధనుష్తో చేస్తున్నా. తమిళ్, తెలుగు అని ముందు అనుకున్నాం. ఇక ఎలాగో ఓటిటితో అందరికీ మంచి రీచ్ వచ్చింది కాబట్టి హిందీలో కూడా ప్లాన్ చేస్తున్నాం. పైగా ధనుష్కి కూడా హిందీలో రీసెంట్గా మంచి మార్కెట్ వచ్చింది. నా ముందు సినిమాల్లా కాకుండా ఇది థ్రిల్లర్ టైప్లో ఉంటుంది, పైగా కథ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. అందుకే మల్టీ లాంగ్వెజెస్ సినిమాలా ప్లాన్ చేసాం..'' అని తెలిపారు