బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రేక్షకులందరికీ కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. గత సీజన్స్తో పోల్చుకుంటే ఈసీజన్లో రచ్చ కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పటికే రెండు ఎలిమినేషన్స్ కూడా జరిగిపోయాయి. హౌస్లో ఫైర్ బ్రాండ్స్గా ఉన్న సరయు, ఉమా దేవి ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో హౌస్లో వేడి మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తిగా సాగింది. నామినేషన్స్లో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేసి అందుకు రీజన్ చెప్పాలని బిగ్ బాస్ ఆడ్డర్ వేశాడు. టైల్స్పై ఎవర్ని అయితే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల పేర్లతో ఉన్న స్టాంప్ వేసి.. ఆ టైల్స్ని సుత్తితో పగల కొట్టాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ఈ నామినేషన్ ప్రక్రియ కాస్త రచ్చగా మారింది. ఒక్కోక్కరు ఇద్దరిని నామినేట్ చేశారు. లహరి ప్రియను నామినేట్ చేస్తూ టాస్క్ అయిన తరువాత ప్రియ తనకి దూరంగా ఉంటున్నారని, ఆవిడ మనసులో ఏదో పెట్టుకుని ప్రతిదానికి కావలనే పాయింట్ చేస్తుందని చెప్పింది లహరి.
దాంతో ప్రియకు కోపం వచ్చింది. హౌస్లో ఉన్న మగాళ్లతో నువ్ బిజీగా ఉంటావ్.. నువ్ మగాళ్లతోనే కలుస్తున్నావ్ అంది ప్రియా. దాంతో నేను ఎవరితో బిజీగా ఉన్నా అంటూ ప్రశ్నించింది లహరి. దానికి ప్రియా .. రవి, మానస్ మిగిలిన వాళ్లు అని అంది. హౌస్లో చాలామంది మగాళ్లు ఉన్నారు. కానీ నువ్ వాళ్లని నామినేట్ చేయవు.. ఎందుకంటే నీకు మగాళ్ళతో ఏం ప్రాబ్లమ్ ఉండదు. నీకు మహిళలతోనే ప్రాబ్లమ్ అంది ప్రియ. దీంతో లహరికి చిర్రెత్తుకొచ్చింది. మీరు పదే పదే మగాళ్లతో ఉంటున్నా అని చెప్పడం చాలా తప్పు, నేను అమ్మాయిలతో ఎవరితో మాట్లాడలేదో చెప్తావా అని హౌస్లో ఉన్న ప్రతి అమ్మాయి దగ్గరకు వెళ్లి నేను నీతో మాట్లాడటం లేదా అని అడిగింది. వాళ్లంతా మాట్లాడుతున్నావ్ అని చెప్పడంతో లహరి ఆవేశం కట్టలుతెంచుకుంది.