ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోయిన్ పై యాసిడ్‌ దాడికి యత్నం!

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 21, 2021, 03:55 PM



ప్రముఖ నటి పాయల్‌ ఘోష్‌ పై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌ దాడి చేయబోయారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె తన చేతికి గాయాలైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. తన కుటుంబ సభ్యులకు మందులు తీసుకురావడానికి బయటికి వెళ్ళినప్పుడు కొందరు దుండగులు తనపై దాడి చేశారని చెప్పారు. దుండగులు ముఖానికి మాస్కులు ధరించి ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో తన చేతికి స్వల్ప గాయాలయ్యాయని, వాళ్ల చేతుల్లో యాసిడ్‌ బాటిల్స్ ఉన్నాయని పాయల్ ఘోష్ చెప్పారు. తాను గట్టిగా కేకలు వేయడంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారని, అప్పటి నుంచి తనకు చాలా భయమేస్తోందని చెప్పారు.


టాలీవుడ్ కు ప్రయాణం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన పాయల్‌.. ‘ఉసరవెల్లి’లో సహాయ నటిగా కనిపించారు. ఆ తర్వాత ‘పటేల్‌ కీ పంజాబీ షాదీ’తో బాలీవుడ్‌ లో అడుగుపెట్టారు. అక్కడ కూడా ఆమెకు ఎక్కువ అవకాశాలు రాలేదు. గతేడాది బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై ఆమె మీటూ ఆరోపణలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com