ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటుడు తరుణ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 22, 2021, 12:29 PM



టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు బుధవారం ఉదయం నటుడు తరుణ్‌ హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా, డ్రగ్స్ వినియోగించే సెలబ్రిటీలెవరైనా మీకు తెలుసా అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు తరుణ్‌ నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని ఇటీవల ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదికలో తేలింది. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలతో 2017 జులైలో తరుణ్ నుంచి ఎక్సైజ్‌శాఖ నమూనాలు సేకరించింది. తరుణ్‌ రక్తం, వెంట్రుకలు, గోళ్లను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరీ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. దీంతో ఎక్సైజ్‌ శాఖ తరుణ్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com