విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'దృశ్యం 2' సినిమా విడుదలకు సిద్ధమైంది. దృశ్యం ఫస్ట్ పార్ట్ లో నటించిన మీనా, నదియా, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్ తదితరులు ఈ సీక్వెల్ సినిమాలోనూ నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు నిర్మించారు. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. ఈ విషయాన్ని మూవీ టీం ప్రకటించింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.