శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత రెండు సినిమాలు పర్లేదనిపించినా ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్ సినిమాతో తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకుంది.తాజాగా మరో బయోపిక్ లో నటించాలని ఉందని తెలిపింది.ఇటీవల ఢిల్లోలో టోక్యో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన జరిపిన పారాలింపియన్స్ సన్మాన కార్యక్రమానికి జాన్వీ అతిధిగా హాజరయ్యింది. అక్కడ చాలా మంది పారాలింపియన్స్ తో మాట్లాడింది. ఆ వేదికపై మాట్లాడుతూ తాను అరుణిమ సిన్హా కథని బయోపిక్ చేయాలి అనుకుంటున్నాను. ఆమె జీవిత చరిత్రని తెరపై చూపించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపింది. నేను అరుణిమ సిన్హాను కలిశాను. తన కథ చాలా స్ఫూర్తిదాయకం. ఆమె కథలో నటించడానికి ఇష్టపడతాను అని తెలిపింది. అరుణిమ సిన్హా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వికలాంగురాలు. ఈమె క్రీడాకారిణి, పర్వతారోహకురాలు కూడా. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.