మా ఎన్నికలు ముగిసిన తర్వాత తామంతా ఏకతాటిపైకి వస్తామని, భుజం భుజం రాసుకుంటూ తిరుగుతామని సినీ పెద్దలు అన్న మాటలు నీటి మూటలే అయ్యాయి. మా లో ఎన్ని లుకలుకలు ఉన్నాయో మీడియా సాక్షిగా బయట పడుతున్నాయి. 'మా' ఫలితాలు వచ్చిన తరువాత అసలు ఆట మొదలైందంటూ కొత్త కొత్త 'ఆత్మ'లు.. ఆత్మఘోషలు బయటకు వస్తున్నాయి. ప్రకాష్ ప్యానల్ మొత్తం..
గెలిచిన ఆయా పదవులకు రిజైన్ చేయగా.. అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణు ఆట మొదలుపెట్టేశారు. ఈ సినీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'మా' మాజీ ప్రెసిడెంట్ శివాజీ రాజా సంచలన కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ.. 'ఇన్నేళ్లలో నేను ఎవరికీ భయపడలేదు..ఎందుకంటే తప్పు చేసిన తప్పుడు నా కొడుకులు భయపడతారు.. నేను తప్పు చేయలేదు కాబట్టి భయపడను. నేను అందరూ బాగుండాలనే కోరుకుంటాను. శివాజీ రాజా అనేవాడు ఇప్పుడే కాదు..
ఎప్పుడూ భయపడడు.. ఆ తప్పుడు నా కొడుకులే భయపడతారు. కొన్ని దెబ్బలు తిన్నాక నేను ఈ మాట చెప్తున్నా.. నన్ను భయపెట్టే మగాడు తెలుగు ఇండస్ట్రీలో ఎవడూ లేడు.నేను షూటింగ్లకు లేటుగా వెళ్లను.. నాకు క్యారెక్టర్ వస్తే చేస్తా లేదంటే లేదు.. క్యారెక్టర్ ఇవ్వమని నేను ఒకడి దగ్గరకు పోను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే..ఈ మాట ఒకడికి గట్టిగా తగలాలనే. వీడు నా గురించే అన్నాడని వాడికి తెలియాలి. వాడికి నేను డైరెక్ట్గానే చెప్పాను.. నీలాంటి బొగడా గాళ్లని చాలామందిని చూశా..బ్యాగ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నావ్ రా అని వాడికి చెప్పా. నా దగ్గర పావలా లేనప్పుడు కూడా ఎవడి దగ్గరా చేయి చాపలేదు.. భయపడలేదు. ఈ బొకడా గాడికి భయ పడతానా?వాడేమంత గొప్పోడు కాదు.. కానీ నేను తిట్టానంటే నన్నే తిట్టాడని వాడు అనుకుంటాడు.. అందుకే చెప్తున్నా. ఇలాంటి వాళ్లని బోలెడు మందిని చూశా.
ఇండస్ట్రీలో చాలా మంది వెధవలు పక్కపక్కనే ఉంటారు.. మనం ఓడిపోతే పక్కకు వెళ్లి డాన్స్లు చేసే వెధవలు కూడా ఉంటారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు శివాజీ రాజా. ఇంతకీ శివాజీ రాజా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు అని ఇండస్ట్రీలో ఎవరికి వారు ఎవరెవరినో ఊహించుకుంటున్నారు. ఏదేమైనా శివాజీ రాజా మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో వారికి మాత్రం సూటిగా గుచ్చుకున్నాయని టాలీవుడ్ టాక్.