ప్రముఖ చిత్ర దర్శకుడు శంకర్ అల్లుడు రోహిత్ దామోదరన్ లైగింక వేధింపుల కేసులో చిక్కుకున్నారు. ఇదే కేసులో మరో ఐదుగురిపై కూడా కేసు నమోదైంది. న్యూస్18 కథనం మేరకు.. ఓ 16 ఏళ్ల బాలిక లైంగిక వేధింపుల ఆరోపణలతో మంగళవారం పుదుచ్చేరిలో రోహిత్ దామోదరన్ పై కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది. పదహారేళ్ల బాలికను లైగింకంగా వేధించినందుకు మొత్తం ఐదుగురిని పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) కింద బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రోహిత్ దామోదరన్ విషయానికి వస్తే.. ఈ ఏడాది జూన్లో మెగా డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అతను ఓ తమిళ క్రికెట్ క్లబ్కు కెప్టెన్గా కూడా చేస్తున్నారు. గతంలో ఈ అమ్మాయి క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లినప్పుడు తనను లైంగికంగా వేధించారని తన ఫిర్యాదులో ఆరోపించింది. అంతేకాదు ఒకవేళ ఇదే విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని తెలిపింది.