200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఉన్న విషయం సంచలనంగా మారింది. ఇక ఇదే కేసులో నే బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్-నోరా ఫతేహి వంటి వారి ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.సురేష్ చంద్ర తో ఈ ఇద్దరూ కలిసి ఉండడంచేత వీరిద్దరిని ఈ కేసులో కి నమోదు చేశారు ఈడీ అధికారులు. ఈడీ విచారణలో భాగంగా నాలుగు సార్లు డుమ్మా కొట్టింది జాక్వెలిన్. నిన్నటి రోజున హాజరుకాకుండా తప్పలేదు ఈ భామకి. సురేష్ చంద్ర తో ఉన్న తన బంధాన్ని తెలియజేస్తూ వారు చేసుకున్నటువంటి లావాదేవీలను కూడా తెలియజేసింది. దీంతో ఈడి అధికారులకు ఈమె నుంచి ఒక కీలక సమాచారం దొరికింది.. దీంతో ఈమె పై కూడా కేసు శిక్ష పడేలా కనిపిస్తోంది.నాలుగు సార్లు ఎందుకు ఈడి అధికారుల ముందు హాజరు కాలేదని ఈడీ అధికారులు అడగగా.. ఆరోగ్య సమస్య కారణంగా హాజరుకాలేదని చెప్పుకొచ్చింది. ఇక ఈమె ఇన్నిసార్లు డుమ్మా కొట్టడంతో వీరికి అనుమానం రావడం చేత జాక్విలిన్ ని మరింత లోతైన ప్రశ్నలు అడిగి కీలకమైన విషయాలను రాబట్టుకున్నారు. ఎందుచేత హాజరు కాలేక పోయింది వాటికి సంబంధించిన ఆధారాలను చూపించలేకపోయింది.ఒకవేళ ఈ ముద్దుగుమ్మకి ఈ కేసులో దోషిగా తేలితే జైలు శిక్ష తప్పదన్నట్లు గా సమాచారం. ఈ కేసు విచారణ పై ఈడీ అధికారులు ఐదు సంవత్సరాలుగా విచారిస్తున్నారు. ఇప్పటికే సుఖేష్ చంద్రాన్ని, తన భార్య లీనా మరియు పాల్ కూడా అరెస్టు చేయడం జరిగింది. దాంతో వారు బెయిల్ మీద బయటకు కూడా వచ్చారు.